TG: కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ

త్వరలోనే అసెంబ్లీలో నివేదిక: సీఎం రేవంత్.. అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటాం.. ఇదీ రాజకీయ పార్టీ ఇచ్చిన నివేదిక కాదు;

Update: 2025-08-05 02:00 GMT

త్వ­ర­లో­నే అసెం­బ్లీ­లో కా­ళే­శ్వ­రం కమి­ష­న్ ని­వే­ది­క­ను ప్ర­వే­శ­పె­డ­తా­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి కీలక ప్ర­క­టన చే­శా­రు. అసెం­బ్లీ­లో చర్చిం­చా­కే తదు­ప­రి ఏం చే­యా­ల­నే దా­ని­పై ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­మ­న్నా­రు. ఈ ని­వే­ది­క­పై అన్ని పా­ర్టీల అభి­ప్రా­యా­లు తీ­సు­కుం­టా­మ­న్నా­రు. ఇది రా­జ­కీయ పా­ర్టీ­నో.. ప్ర­జా సం­ఘా­లో ఇచ్చిన ని­వే­దిక కా­ద­న్న రే­వం­త్... అవి­నీ­తి కా­ళే­శ్వ­రం కు­ప్ప­కూ­లిం­ద­న్నా­రు. ప్ర­జా ప్ర­తి­ని­ధు­ల­కు ని­వే­దిక ఇస్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు.

మంత్రి మండలి ఆమోదం

కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రి మండలి ఆమోందించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని.. త్వరలోనే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు అందరికీ కమిషన్ నివేదిక ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు అని అన్నారు. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదని.. నిపుణుల కమిటీ ఇచ్చిందని తెలిపారు. దీనిపై ఎవరు ఏ రకంగా మాట్లాడుతారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు.

రాష్ట్రాన్ని పణంగా పెట్టారు: ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. మేడిగడ్డకు మార్చారని చెప్పారు. భారీగా తెచ్చిన అప్పులతో చేపట్టిన కాళేశ్వరం..బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయిందన్నారు.

అంతా కేసీఆరే చేశారు: డిప్యూటీ సీఎం

మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్‌ కారణమని పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక చెబుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్‌ సొంత నిర్ణయాలే తప్ప.. నిపుణుల కమిటీ నివేదిక అమలు చేయలేదని మండిపడ్డారు. సరైన అధ్యయనాలు, పరిశోధనలు లేకుండానే డిజైన్లు రూపొందించారన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే ప్రాజెక్టు కడుతున్నామని కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పారు.

Tags:    

Similar News