TG: ని­రు­ద్యో­గు­లు పోటీ పరీ­క్ష­ల­కు సి­ద్ధం కండి

కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి... త్వ­ర­లో­నే నో­టి­ఫి­కే­ష­న్ ఇవ్వ­బో­తు­న్నా­మన్న సీఎం

Update: 2025-12-06 05:00 GMT

ని­రు­ద్యో­గు­ల­కు సీఎం రే­వం­త్ రె­డ్డి కీలక సూచన చే­శా­రు. ని­రు­ద్యో­గు­లు పోటీ పరీ­క్ష­ల­కు సి­ద్ధం కా­వా­ల­ని.. త్వ­ర­లో­నే నో­టి­ఫి­కే­ష­న్ ఇవ్వ­బో­తు­న్నా­మ­ని చె­ప్పా­రు. పం­చా­యి­తీ ఎన్ని­కల కోసం చదు­వు­కు­న్న యువత సమయం వృధా చే­సు­కో­వ­ద్ద­ని సూ­చిం­చా­రు. రా­జ­కీ­యా­లు ఎప్పు­డై­నా చే­యొ­చ్చ­ని.. వయో పరి­మి­తి దా­టి­తే ప్ర­భు­త్వ ఉద్యో­గా­ల­కు అన­ర్హు­లు అవు­తా­ర­ని హె­చ్చ­రిం­చా­రు. తల్లి­దం­డ్రు­లు పి­ల్ల­ల­ను బాగా చది­విం­చు­కో­వా­ల­ని.. చదు­వు­కుం­టే­నే మీ పి­ల్ల­లు..కు­టుం­బా­లు బా­గు­ప­డ­తా­య­ని అన్నా­రు.  ప్ర­జా పాలన వి­జ­యో­త్స­వా­ల­లో భా­గం­గా శు­క్ర­వా­రం వరం­గ­ల్ జి­ల్లా నర్సం­పే­ట­లో సీఎం రే­వం­త్ రె­డ్డి పర్య­టిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా రూ.508 కో­ట్ల­తో పలు అభి­వృ­ద్ధి పను­ల­కు శం­కు­స్థా­పన చే­శా­రు. అనం­త­రం బహి­రంగ సభలో పా­ల్గొ­ని ఆయన మా­ట్లా­డా­రు. వరం­గ­ల్ పర్య­ట­న­కు వస్తే స్ఫూ­ర్తి కలు­గు­తుం­ద­న్నా­రు. పో­రాట యో­ధుల స్ఫూ­ర్తి­తో పాలన కొ­న­సా­గి­స్తు­న్నా­మ­ని.. కానీ గత పా­ల­కు­లు ఫామ్ హౌ­స్‎­లు ని­ర్మిం­చు­కు­న్న­రు.. కా­ర్లు కొ­న్నా­రు.. పదేం­డ్లు పా­లిం­చిన వా­ళ్లే ఆస్తు­లు పెం­చు­కు­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు. 

సర్పంచ్ అభ్యర్థులకు సూచన

‘నోరు మం­చి­దై­తే ఊరు మం­చి­ద­వు­తుం­ది..ఊరి­కి ఉప­యో­గ­ప­డే­వా­ళ్ల­నే ఎన్ను­కో­వా­లి. ఎమ్మె­ల్యే­లు, మం­త్రు­ల­ను కలి­సి పను­లు చే­యిం­చే­వా­రి­ని పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో గె­లి­పిం­చం­డి. గొ­డ­వ­లు చే­సే­వా­రి­ని గె­లి­పిం­చొ­ద్దు.. యువత రా­జ­కీయ కక్ష­ల­కు బలి­కా­వొ­ద్దు.. ఎన్ని­క­ల్లో డబ్బు ఖర్చు చే­యొ­ద్దు.. ప్ర­జల మనసు గె­ల­వా­లి’ అని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి హి­త­వు పలి­కా­రు. వరం­గ­ల్‌ జి­ల్లా నర్సం­పే­ట­లో శు­క్ర­వా­రం ము­ఖ్య­మం­త్రి రూ.531 కో­ట్ల­తో చే­ప­ట్ట­ను­న్న అభి­వృ­ద్ధి పను­ల­కు డి­జి­ట­ల్‌ రూ­పం­లో శం­కు­స్థా­ప­న­లు చే­శా­రు. వీ­టి­లో ప్ర­భు­త్వ వై­ద్య­క­ళా­శాల, వస­తి­గృహ భవన సము­దా­యం, యం­గ్‌ ఇం­డి­యా ఇం­టి­గ్రే­టె­డ్‌ స్కూ­ల్, నా­లు­గు వరు­సల రహ­దా­రుల వి­స్త­రణ, అభి­వృ­ద్ధి, ‘‘ఇక్క­డి­కి వచ్చిన భారీ జన­సం­దో­హా­న్ని చూ­స్తుం­టే.. వి­జ­యో­త్సవ సం­బ­రా­లు జరు­పు­కొ­న్న సం­తృ­ప్తి కలి­గిం­ది. మీరు అం­డ­గా ని­ల­బ­డం­డి.. ది­ల్లీ­ని ఢీ­కొ­డ­తా.. రా­వా­ల్సిన ని­ధు­లు సా­ధి­స్తా. ని­ల­దీ­సి ప్ర­శ్నిం­చేం­దు­కు భయ­ప­డే­వా­డి­ని కాదు. ప్ర­జ­లు ఆశీ­ర్వ­ది­స్తే­నే జడ్పీ­టీ­సీ నుం­చి ము­ఖ్య­మం­త్రి వరకు పద­వు­లు వరిం­చా­యి. చదు­వే జీ­వి­తా­ల­ను మా­రు­స్తుం­ది. చదు­వు­కు­న్న­వా­డే గు­ణ­వం­తు­డు.. ధన­వం­తు­డు. తల్లు­లు తమ పి­ల్ల­ల­ను బాగా చది­విం­చా­లి. నా­ణ్య­మైన వి­ద్య­నం­దిం­చే బా­ధ్యత తీ­సు­కుం­టా." అని రే­వం­త్ అన్నా­రు.

పదేండ్లలో ఏమీ మారలేదు

ఈ ప్రాంత ప్ర­జ­ల­కు పదేం­డ్ల­లో ఏమీ రా­లే­ద­న్నా­రు. వరి వే­స్తే ఉరి అని ఆనా­డు కే­సీ­ఆ­ర్ అన్నా­రు.. కానీ మేం సన్న వడ్ల­కు బో­న­స్ ఇస్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. దు­క్కి­దు­న్నే ప్ర­తి రై­తు­కు 24 గంటల కరెం­టు ఇస్తు­న్నా­మ­ని.. ఉచిత కరెం­ట్ పే­టెం­ట్ హక్కు కాం­గ్రె­స్‎­దే­న­ని స్ప­ష్టం చే­శా­రు. రెం­డేం­డ్ల క్రి­తం గడీ­ల­ను కూ­ల్చి ప్ర­జా­ప్ర­భు­త్వా­న్ని ఏర్పా­టు చే­శా­మ­ని.. పదేం­డ్లు దో­చు­కు­న్న వారి గడీ­ల­కు కరెం­టు పీ­కే­శా­మ­న్నా­రు.  2026, మా­ర్చి 31లోపు వరం­గ­ల్ ఎయి­ర్ పో­ర్టు పను­లు స్టా­ర్ట్ చే­స్తా­మ­ని తె­లి­పా­రు. ఈ నె­లా­ఖ­రు (డి­సెం­బ­ర్)లోపు మము­నూ­రు ఎయి­ర్ పో­ర్టు భూ­సే­క­రణ పూ­ర్తి అవు­తుం­ద­ని చె­ప్పా­రు. పదే­ళ్ల­లో కే­సీ­ఆ­ర్ ఒక్క­రో­జై­నా వరం­గ­ల్ ఎయి­ర్ పో­ర్టు గు­రిం­చి ఆలో­చిం­చా­డా అని ప్ర­శ్నిం­చా­రు. వి­దే­శా­ల­లో చదు­వు­కు­న్నా­మ­ని పొ­డు­గు­పో­డు­గు మా­ట­లు చె­ప్పే వా­ళ్ల­కు తె­లం­గా­ణ­లో రెం­డవ ఎయి­ర్ పో­ర్టు తే­వా­ల­నే సోయి ఎం­దు­కు లే­ద­ని ని­ల­దీ­శా­రు. హై­ద­రా­బా­ద్‎­లో ఏం ఉంటే అవ­న్నీ వరం­గ­ల్‎­లో ఏర్పా­టు చే­స్తు­న్నా­మ­న్నా­రు. వరం­గ­ల్‎­ను హై­ద­రా­బా­ద్‎­కు ధీ­టు­గా తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని చె­ప్పా­రు. 

Tags:    

Similar News