రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ దొంగ రెండు ATMలలో చోరీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. మొదట హైదరాబాద్ రోడ్డులోని SBI ATMలో దొంగతనానికి ట్రై చేశాడు. ATM తెరిచే ప్రయత్నంగా చేస్తుండగా.. అటుగా పోలీసుల పెట్రోలింగ్ వాహనం రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత బస్టాండ్ వెళ్లి అక్కడి ఇండి క్యాష్ ATMను దోచుకునే ప్రయత్నం చేశాడు. అది కూడా కుదరకపోవడంతో.. బస్టాండ్లో నిద్రపోతున్నవారి నుంచి సెల్ఫోన్ దొంగతనం చేసి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఆధారంగా షాద్నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.