నిజామాబాద్ జిల్లా బోదన్ శివారులో దొంగలు హల్ఛల్ చేశారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ పెట్రోల్ బంక్లో చోరీ చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బందిపై రాళ్లు విసిరి.. కత్తితో బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ పుటేజీ అధారంగా దర్యాప్తు చేస్తున్నారు.