పీవీ, ఎన్టీఆర్ ఘాట్లపై అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రేపు ఉదయం పీవీ, ఎన్టీఆర్ ఘాటుకు వెళ్తానని.. వారికి నివాళులర్పించి అక్కడి నుంచే ప్రచారం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఏం చేస్తావో చేసుకో అని అక్బరుద్దీన్కు సవాల్ చేశారు బండి సంజయ్. మహనీయుల సమాధులు ముట్టుకున్న మరుక్షణమే.. దారుసలాంను బద్దలు కొడతామని హెచ్చరించారు.