MLC Kavitha : ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్... పసుపు బోర్డు ఏమైందంటూ..!

MLC Kavitha : మోసపూరిత హామీలతో అర్వింద్‌ ఎంపీగా గెలిచారని.. ఎన్నికలకు ముందు చెప్పిన పసుపు బోర్డు ఏమైందని ఆమె ప్రశ్నించారు.

Update: 2022-05-04 13:55 GMT

MLC Kavitha : నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అర్వింద్‌ ఎంపీగా గెలిచారని.. ఎన్నికలకు ముందు చెప్పిన పసుపు బోర్డు ఏమైందని ఆమె ప్రశ్నించారు. హామీ నిలబెట్టుకోకపోతే గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో 2016 లోనే పసుపు బోర్డు గురించి ప్రధానమంత్రి మోదీని కలిశానని... 2017 లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరం కూడా రాసిందని కవిత గుర్తు చేశారు. గ్రూప్‌ వన్‌ ఉద్యోగాలను బీజేపీ రాజకీయం చేస్తోందన్న కవిత.. కేంద్రం ప్రకటించిన ఉద్యోగాలు ఏమయ్యాయని ఎదురుదాడి చేశారు.

Tags:    

Similar News