అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు,కటౌట్లకు ఫైన్లు విధిస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ నగరంలో చాలా ఇళ్లను ఖాళీగా ఉన్నాయి.ఈ నేపధ్యంలో కొందరు వేరే చోట్ల తమ ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే సమాచారాన్ని పోస్టర్ల వేస్తున్నారు. ఇలా చేసిన వారికి జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. జగద్గిరిగుట్టలో కృష్ణ డిజైనర్స్ సంస్ధకు ఎనిమిది వేల రూపాయలు ఫైన్ వేశారు. ట్విట్టర్లో ఓ సిటిజన్ ఫిర్యాదు చేయగా జీహెచ్ఎంసీ ఈవీ డీఎం ఆ సంస్ధకు పెనాల్టీ వేశారు.