సోమవారం మాజీ ఎంపీ విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని విజయశాంతి నివాసంలో సుమారు అరగంటపాటు ఇరువురు సమావేశం అయ్యారు. విజయశాంతి బీజేపీలో చేరతారన్న ప్రచారంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్గా విజయశాంతి ఉన్నారు. గత ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు రాములమ్మ.