సీతారాంబాగ్లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి..!
హైదరాబాద్ సీతారాంబాగ్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటించారు. లైన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేట్ బ్యాంక్ను ప్రారంభించారు.
హైదరాబాద్ సీతారాంబాగ్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటించారు. లైన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేట్ బ్యాంక్ను ప్రారంభించారు. డెల్టా ప్లస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం సూపర్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెస్తుందని కిషన్రెడ్డి అన్నారు. రెండవ ట్రయల్ పూర్తి అయిన తర్వాత 18 ఏళ్ల లోపు ఉన్నవారికి సిరం ద్వారా టీకాలు అందిస్తామన్నారు. సెకండ్వేవ్లో కేంద్రం చేపట్టిన చర్యలను వివరించిన కిషన్రెడ్డి.. సోషల్ మీడియాలో డెల్టా ప్లస్ వైరస్పై అసత్య ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు.