నాగార్జున సాగర్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం మాదే: ఉత్తమ్
నాగార్జున సాగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కంటే ముందే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించేలా నోటిఫికేషన్ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
నాగార్జున సాగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కంటే ముందే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించేలా నోటిఫికేషన్ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సాగర్ ఫలితం విరుద్ధంగా వస్తుందనే సీఎం కేసీఆర్ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్టేట్ ఎలక్షన్స్ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరోనా ఇంతగా విజృంభిస్తోంటే .. ఎన్నికలు అవసరమా..? అని ఉత్తమ్ అన్నారు. హాస్పిటల్లో బెడ్స్ లేవని వైద్యారోగ్య శాఖ మంత్రే చెప్పారని తెలిపారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్లో కూడా జానారెడ్డి గెలవబోతున్నారని చెప్పారు.