చంపాపేట్ రెడ్డి బస్తీలోని నాలలో ఓ మనిషి కాలు కొట్టుకు రావటం కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాలు చూసిన కొందరు ఎవరిదైనా మృత దేహం పక్కన ఉందేమో అని గాలింపు చేపట్టారు. అయినా కనిపించకపోవడంతో వెంటనే 100కు డయిల్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న సైదాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది కాలును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.