సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూకు తృటిలో ప్రమాదం తప్పింది. ఖుష్బూ వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఒకవైపు డోర్ పూర్తిగా ధ్వంసమైంది. తమిళనాడులో చెంగల్పట్టు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మరికొంతమందితో కలిసి వేల్ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా మెల్వార్వతూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.