టూరిస్టు వీసాకు వెయ్యి డాలర్లు వసూలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అమెరికా టూరిస్టు వీసా ఇంటర్వ్యూకు ఫాస్ట్ ట్రాక్ ఫీజు పేరిట వెయ్యి డాలర్లు వసూలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ త్వరితగతిన ఇంటర్వ్యూలు నిర్వ హించడం కోసం ధర పెంచితే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్ అధికారులు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. టూరిస్ట్, ఇతర నాన్ ఇమ్మిగ్రాంట్ వీసాలపై అమెరికాకు వచ్చే ప్రజలు ప్రస్తుతం ప్రాసెసింగ్ ఫీజు కింద 185 డాలర్ల చెల్లిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా వచ్చే డిసెంబర్ నుంచి దీన్ని చేపట్టా లని అమెరికా ఆలోచన చేస్తోంది. కానీ సర్వీస్ ప్రొవైడ్ ధర కంటే ఫీజు అధికంగా నిర్ణయించ డం గతంలో చెప్పిన తీర్పుకు విరుద్ధమంటున్న న్యాయ నిపుణులు భవిష్యత్తులో దీనిని కోర్టు కొ ట్టివేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వైట్ హౌజ్ బడ్జెట్ కార్యాలయం దీన్ని తిరస్క రించ వచ్చనే అభిప్రాయం కూడా ఉంది.
స్టూడెంట్ వీసాలపై భయం
విదేశీ విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలు తనిఖీ చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో అమెరికాలో చదువాలని కలలుకంటున్న విద్యార్థుల్లోగుబులు రేగుతోంది. ఫలితంగా వివాదానికి దారితీస్తాయని భావిస్తున్న పోస్టులను వారు డిలీట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసింది.