అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.ఇదే తరుణంలో ఉపాధ్యక్షుడెవరన్న చర్చ కూడా మొదలైంది. గత ఎన్నికల్లో భారత మూలా లున్న కమల హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగా.. ఈసారి తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడు అవుతున్నారు. ఆయనే జేడీ వాన్స్ . ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లి దండ్రులు భారత్ నుంచి వెళ్లి అమె రికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టిపెరిగారు. యేల్ విశ్వ విద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా, యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా చేశారు. యేల్ విశ్వవిద్యాలయంలోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో వారిద్దరూ పెళ్లి చేసుకు న్నారు. వీరికి ముగ్గురు సంతానం. వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలం దించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకు న్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్ గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వ ర్తించారు. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు.