PM Modi: శుభాంశు శుక్లా 140 కోట్ల మంది ఆకాంక్షలను మోసుకెళ్లారు : ప్రధాని మోదీ

దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామి;

Update: 2025-06-25 08:45 GMT

 భారత వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఈ మిషన్‌కు శుక్లా గ్రూప్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దీనిపై తాజాగా ప్రధాని   నరేంద్ర మోదీ   స్పందించారు.

ఇక భారత్‌, హంగెరీ, పోలాండ్‌, యూఎస్‌ వ్యోమగాములతో కూడిన స్పేస్‌ మిషన్‌ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ వ్యోమగాములకు అభినందనలు తెలియజేశారు. భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. కోట్ల మంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని కొనియాడారు.

ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఫాల్కన్‌ 9 రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వారు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్‌ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంటే గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది.

ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజులపాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో వ్యోమగాములు అక్కడి నుంచి ముచ్చటించనుననారు.

Tags:    

Similar News