Hage Geingob: నమీబియా అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్‌ కన్నుమూత

కారణమేంటంటే ...

Update: 2024-02-04 07:15 GMT

నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (82) ఇకలేరు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న హేజ్.. ఆదివారం తెల్లవారుజామున విండ్‌హోక్‌లోని లేడీ పోహంబా ఆస్పత్రిలో కన్నుమూశారు. నమీబియా అధ్యక్ష కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్‌ మృతిచెందారని సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌ చేశారు.

2014లో అస్వస్థతకు గురైన గింగోబ్‌ సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ సోకినట్లు తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్తానని కూడా హేజ్ పేర్కొన్నట్లు ప్రెసిడెన్సీ తెలిపింది.  మరుసటి సంవత్సరం అధ్యక్షుడయ్యాడు. దక్షిణాఫ్రికా దేశంలో ఈ ఏడాది చివరిలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇంతలో ఆయన మరణించారు. దీంతో స్థానిక ప్రజలతోపాటు అనేక మంది ప్రముఖులు హేజ్ గింగోబ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షుడు నాంగోలో ఎమ్బుంబా వ్యవహరించనున్నారు.

Tags:    

Similar News