అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియ లాస్ఏంజెలెస్ లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు, అరెస్టులతో హెటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లపైకి చేరుకుని నిరసన చేపట్టారు. వారిపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. సర్వీస్ ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్ట్లను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఆయన విడుదలకు ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ఆందోళనకారులకు హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా అధికారుల పైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్స్ తమ బాధ్యతలను నిర్వర్తించలేరనే విషయం అందరికీ తెలుసునని పేర్కొన్నారు.
ఫెడరల్ ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తుందని చెప్పా రు. మరోవైపు వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ లాస్ఏంజెలెస్ పరిస్థితిపై మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా చట్టాలకు, సార్వభౌమా ధికారానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. అక్రమ వలసదారుల్ని ప్రభుత్వం కచ్చితంగా బహిష్కరిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు అక్కడ 44మందిని అరెస్టు చేశామని ఫెడరల్ అధికారులు పేర్కొన్నారు. రెండు రో జులుగా జరుగుతున్న ఆందోళనలతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో 2000 మంది నేషనల్ గార్డెన్ ను అక్కడ మోహరించాలని ట్రంప్ సర్కార్ ఆదేశించింది. అయితే, నేషనల్ గార్డను మోహరించాలనే ట్రంప్ ఆదేశాల్ని కాలిపోర్నియా గవర్నర్ తప్పుబట్టారు. ట్రంప్ చర్యలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని గవిన్ న్యూసమ్ వ్యాఖ్యానించారు. నేషనల్ గార్డ్స్ ను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదక రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.