బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకం: భారతదేశానికి యూఏఈ మద్దతు

దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై భారత జెండాని ప్రతిబింబించేలా జెండా రంగుల ప్రదర్శన జరిగింది. 23 సెకెన్ల నిడివితో జాతీయ జెండాని బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శించారు

Update: 2021-04-26 10:15 GMT

భారతేదశం కోవిడ్ సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో, భారతేదశానికి యూఏఈ సంఘీభావం తెలిపింది. దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై భారత జెండాని ప్రతిబింబించేలా జెండా రంగుల ప్రదర్శన జరిగింది. 23 సెకెన్ల నిడివితో జాతీయ జెండాని బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శించారు భారతదేశానికి సంఘీభావం తెలుపుతున్నట్లు బుర్జ్ ఖలీఫా అధికారిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కాగా, రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారతదేశంలో మూడున్నర లక్షలకు చేరుకుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ కరోనా వైరస్ ఈ స్థాయిలో అత్యధిక కేసులు నమోదు చేయలేదు ఇప్పటివరకు. దేశంలోని పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. 

Similar News