Iran-Israel War Effect : ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భారత్లో పెట్రో కొరత?

Update: 2025-06-24 12:00 GMT

తమ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ ముడి చమురుకు జీవనాడి అయిన ఈ జలసంధిని మూసివేస్తే భారత్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఒమన్ఇరాన్ మధ్య ఇరుకుగా ఉండే ఈ జల సంధి ద్వారా.. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు దాదాపు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 30% సమానం. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్ఎనీ (లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్) లో మూడింట ఒక వంతు ఈ నుంచే వస్తుంది. ఈ నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే రాక పోకలు సాగించాలి. భారత్ అవసరాల్లో 85% ముడి చమురు సౌదీ, ఇరాక్, యూఏఈ నుంచి రవాణా అవుతోంది. ఖతార్ నుంచి ఎల్ఎన్ జీ కూడా ఈ మార్గంలోనే వస్తుంది. దీంతో భరత ఇంధన భద్రతపై ప్రభావం పడుతుం దని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మణ కుమార్ బెహెరా అన్నారు. ఈ జలసంధి మూసివేతతో ప్రపంచ వ్యాప్తంగా చమురు వ్యాపారానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని నేవీకి చెందిన రిటైర్డ్ కెప్టెన్ డీకే శర్మ తెలిపారు. సరిగ్గా అదే అభిప్రాయాన్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కూడా వ్యక్తం చేసింది. అక్కడి నుంచి వచ్చేది తక్కువే : మంత్రి ఈ ఆందోళనల నేపధ్యంలో కేంద్ర పెట్రోలి యం శాఖ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ స్పందించారు. గత రెండు వారాలుగా పశ్చిమా సియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరి స్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. కొన్నేళ్లుగా మన సరఫరాలను వేర్వేరు మార్గా లకు వికేంద్రీకరించమన్న మంత్రి.. ఇప్పుడు హర్మూజ్ జలసంధి ద్వారా ఎక్కువ భాగం రావడం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News