యుద్ధ సమయంలో డ్రోన్లను నేలకూల్చడానికి లేజర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను వినియోగించినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ (ఐడీఎఫ్)క చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి డైరెక్టరేట్ చీఫ్ డేనియల్ గోల్డ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్, 2023లో గాజా నుంచి హమాస్ దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి డ్రోన్లను నేలకూల్చడం కోసమని లేజర్ ఆధారిత ఆయుధాలను 40 సార్లకు పైగా వాడినట్టు వెల్లడించారు. లేజర్ ఆయుధాలతో ధ్వంసమైపోయిన వాటిలో అత్యధిక డ్రోన్లు లెబనాన్కు చెందినవని తెలిపారు.
అత్యంత శక్తిమంతమైన లేజర్ సిస్టమ్ ను పెద్ద ఎత్తున రణరంగంలో మోహరించిన తొలిదేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ఈ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి రక్షణ రంగానికి చెందిన పరిశ్రమలు, స్టార్టప్ లతో కలిసి ఐడీఎఫ్ ఏళ్ల తరబడి శ్రమించింది. పోరాటంలో విజయం సాధించడం ద్వారా ఈ టెక్నాలజీలో పరిపక్వతను, ప్రభావశీలత ను లేజర్ సిస్టమ్ నిరూపించింది. దీనిని తొలిసారిగా మోహరిం పజేయడంలో మా బలగాలు అత్యంత తెగువను ప్రదర్శించాయి. దీని నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో ఈ సిస్టము శాశ్వతంగా మోహరింప జేయడానికి ఉపకరిస్తుందని ప్రకటన పేర్కొంది. ఇదే విషయమై గోల్డ్ మాట్లాడుతూ మా రక్షణ రంగానికి చెందిన పరిశ్రమలు, ప్రపంచ స్థాయి స్టార్టప్ లు ఎంతో శ్రమకోర్చి అభివృద్ధి లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ బహుళ రక్షణ వ్యవస్థకు అదనపు వరుసగా సేవలందిస్తుంది అని తెలిపారు.