ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్లో 600 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు తేలింది. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు,126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.