JD Vance: త్వరలో భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ పర్యటన

జేడీ వాన్స్ భార్య ఉష పూర్వీకులది ఆంధ్రప్రదేశ్;

Update: 2025-03-12 05:45 GMT

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉష త్వరలోనే భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెలలోనే జేడీ వాన్స్ దంపతులు భారత్ లో పర్యటించనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత నెలలో ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో జేడీ వాన్స్ పర్యటించారు. ఆయన రెండో విదేశీ పర్యటన భారత్ లో ఉండనుంది.

జేడీ వాన్స్ భారత్ కు అల్లుడు అనే విషయం తెలిసిందే. ఆయన భార్య పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో విద్యను అభ్యసించేటప్పుడు జేడీ వాన్స్ ను ప్రేమించారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా జేడీ వాన్స్ కుటుంబంతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వాన్స్ పిల్లలకు మోదీ ప్రత్యేకమైన బహుమతులు కూడా అందించారు. వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. 

ఇదిలా ఉంటే ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించన దగ్గర నుంచి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతుంది. అంతేకాకుండా అమెరికా మార్కెట్ కూడా భారీగా దెబ్బతింది. ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన చేశారు. అక్కడ జేడీ వాన్స్ కుటుంబంతో మోడీ భేటీ అయ్యారు. అలాగే జేడీ వాన్స్ పిల్లలకు మోడీ ప్రత్యేకమైన బహుమతులను కూడా అందజేశారు. జేడీ వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కూడా మోడీ పాల్గొన్నారు. జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమావేశం జరిగిందని.. వివిధ అంశాలపై గొప్ప సంభాషణ జరిగిందని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మోడీకి ట్వీట్‌కు జేడీ వాన్స్ కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

Tags:    

Similar News