Nepal Plane Crash: అత్యంత విషాదం.. 16 ఏళ్ల క్రితం భర్త.. ఇప్పుడు భార్య..

Nepal Plane Crash: మరణం ఎప్పుడు ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు.. పుట్టుక మాదిరే దేవుడు మరణం కూడా ఎప్పుడో డిసైడ్ చేసే ఉంచుతాడేమో.. ఈ సంఘటన మనకు ఇలాంటి భావనే కలిగిస్తుంది.;

Update: 2023-01-16 09:18 GMT

Nepal Plane Crash: మరణం ఎప్పుడు ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు.. పుట్టుక మాదిరే దేవుడు మరణం కూడా ఎప్పుడో డిసైడ్ చేసే ఉంచుతాడేమో.. ఈ సంఘటన మనకు ఇలాంటి భావనే కలిగిస్తుంది.  16 ఏళ్ల క్రితం ఇదే విధమైన విమాన ప్రమాదంలో యతి ఎయిర్‌లైన్స్ విమానం కో-పైలట్ అంజు ఖతివాడా తన భర్తను కోల్పోయింది.




యాదృచ్ఛికంగా, ఆమె భర్త దీపక్‌ పోఖ్రెల్‌ కూడా యతి ఎయిర్‌లైన్స్‌కు కో-పైలట్. పదహారేళ్ల క్రితం జూన్ 21, 2006న, నేపాల్‌గంజ్ నుండి సుర్ఖెత్ మీదుగా జుమ్లాకు వెళుతున్న యతి ఎయిర్‌లైన్స్ 9N AEQ విమానం కూలిపోవడంతో ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది మరణించారు.అందులో దీపక్ కూడా ఒకరు. సరిగ్గా ఇలాంటి ప్రమాదమే ఇప్పుడు కూడా జరిగింది. అందులో ఉన్న దీపక్ భార్య అంజు ఖతివాడ కూడా ప్రాణాలు కోల్పోయింది. 




అంజు ఖతివాడ పైలట్ కావాలనే తన కలలను నెరవేర్చుకునేందుకు కేవలం కొన్ని సెకన్ల దూరంలో ఉంది. ఈ విమానాన్ని సీనియర్ కెప్టెన్ కమల్ కెసి పైలట్ చేయగా, అంజు విమానంలో కో-పైలట్‌గా ఉన్నారు.



ప్రమాదానికి గురైన యతి ఎయిర్‌లైన్స్ విమానం విజయవంతంగా ల్యాండ్ అయితే కో-పైలెట్ అంజు ఖతివాడా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునేవారు. కానీ, ఉదయం 10.30 గంటలకు నయాగాన్ వద్ద విమానం కూలిపోవడంతో ఆమె కలలు కూలిపోయాయి, ఆమె జీవితం కూడా ముగిసిపోయింది. విమానంలో మొత్తం 72 మంది మరణించారు - 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పైలట్ కావడానికి కనీసం 100 గంటల విమాన అనుభవం అవసరం. అంతకుముందు, అంజు నేపాల్‌లోని దాదాపు అన్ని విమానాశ్రయాలలో విజయవంతంగా ల్యాండ్ అయింది.



నేపాల్ విమాన ప్రమాదం: 68 మృతదేహాలు వెలికితీశారు. ఆదివారం నేపాల్‌లోని పోఖారాలో కుప్పకూలిన ఏటీ ఎయిర్‌లైన్స్ విమానం శిథిలాల నుంచి రక్షకులు ఇప్పటివరకు మొత్తం 68 మృతదేహాలను వెలికితీశారు. పాత విమానాశ్రయం మరియు పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య విమానం కూలిపోయిందని యతి ఎయిర్‌లైన్స్ తెలిపింది.




ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పిల్లలు, 62 మంది పెద్దలు ఉన్నారు. నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం, మరణించిన ప్రయాణీకులలో 53 మంది నేపాలీ పౌరులు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒక ఐరిష్, ఒక ఆస్ట్రేలియన్, మరికొంత మంది విదేశీయులు ఉన్నారు.




ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు ప్రయాణికులు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందినవారు. విమానం కూలిపోవడానికి నిమిషాల ముందు, విమానంలో తమ అనుభవాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్నారు.. అంతలోనే అత్యంత విషాదకరంగా విమానం కుప్పకూలి విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Tags:    

Similar News