అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

Update: 2021-01-30 09:26 GMT

జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి రోజున మహాత్ముడికి అమెరికాలో ఘోర అవమానం జరిగింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దావిస్ నగరంలోని సెంట్రల్ పార్కులో ఉన్న 6 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 294 కేజీల బరువు, ఆరు అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా బేస్ మెంట్ నుంచి తొలగించివేశారు.

అయితే ఆ విగ్రహాన్ని అక్కడినుంచి తొలిగించి... దీన్ని మళ్ళీ బాగు చేస్తామని డేవిస్ సిటీ కౌన్సిలర్ ల్యుకాస్ ఫ్రెరిచ్ తెలిపారు. కాగా దీనిపై భారత అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అటు నాలుగేళ్ల కిందట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత్‌ అమెరికాకు బహుమతిగా పంపింది. 


Tags:    

Similar News