పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచిస్థాన్లో జరుగుతున్న ఉద్యమాలను అణచివేసేందుకు ఇస్లామాబాద్ ప్రభుత్వం కొత్త వ్యూహం పన్నింది. ప్రత్యేక దేశం కోసం బలోచ్ లిబ రేషన్ ఆర్మీ (బీఎల్) వంటి సంస్థ లు చేస్తున్న సాయుధ పోరాటంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమైంది. ఇందు కోసం ఇటీవల (జూన్ 4న) తీసుకొచ్చిన ఓ వివాదాస్పద చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఉగ్రవాద వ్యతిరేక (సవరణ) చట్టం 2025పై స్థానిక పౌరుల తోపాటు మానవహక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్తచట్టం ప్రకారం ప్రావిన్సులో పనిచేస్తున్న భద్రత బలగాలకు విస్తృత అధికారులు లభిస్తాయి. దీనిపై న్యాయ నిపుణులు, పౌర సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం వల్ల అణచివేత, అశాంతి మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.