Pakistan: ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు.. 30 మంది మృతి, 50 మందికి గాయాలు
Pakistan: పేలుడుకు బాధ్యులు ఎవరూ అనేది ఇంకా తెలియరాలేదు.
Pakistan:పాకిస్థాన్ నగరంలో శుక్రవారం రద్దీగా ఉండే షియా మసీదులో బాంబు పేలడంతో కనీసం 30 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పెషావర్లోని కిస్సా ఖ్వానీ బజార్ ప్రాంతంలోని జామియా మసీదులో భక్తులు శుక్రవారం ప్రార్థనలు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని రెస్క్యూ అధికారి తెలిపారు. పేలుడుకు బాధ్యులు ఎవరూ అనేది ఇంకా తెలియరాలేదు.
ఇప్పటివరకు 30 మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. తీవ్రంగా గాయపడిన మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు దుండగులు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, కాపలాగా నిలబడిన పోలీసులపై కాల్పులు జరిపారని రాజధాని నగర పోలీసు అధికారి పెషావర్ ఇజాజ్ అహ్సన్ తెలిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.