ఇరాన్ అణు ఒప్పందాలకు నిరాకరిస్తే బాంబుదాడులకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు ఇరాన్ దీటైన జవాబు చెప్పింది. ఈ మేరకు అప్ర మత్తమైన ఇరాన్ క్షిపణులతో సిద్దమైంది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్ప్యాడ్ పై సిద్ధంగా పెట్టినట్లు టెహ్రాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశాలున్నట్లు తెలిపింది. అత్య వసర పరిస్థితులు ఎదురైతే అమెరికా పరిసర ప్రాంతాలపై దాడులకూ వీటిని ఉపయోగించనున్నట్టు కథనంలో పేర్కొంది. అణు ఒప్పందం కోసం అమెరికా ప్రత్యక్ష చర్చలకు ఆహ్వానిం చిందని, దానిని తిరస్కరించామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమ ని చెప్పారు. దీనిపై ట్రంప్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇరాన్ పై బెదిరింపులకు దిగారు. అణుఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవని, ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయని అన్నారు. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ట్రంప్ తొలి విడుత అధికారం లో ఉన్న సమయంలో ఇరాన్తో సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణుఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇరాన్ పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎన్నోఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణుఒప్పందం కుదు ర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. వీటిని ఇరాన్ తిరస్కరించింది.