సీఎం జగన్కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు: చంద్రబాబు

టీడీపీ సంక్షేమానికి మారుపేరు అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలో సమావేశం నిర్వహించిన చంద్రబాబు..టీడీపీ సంక్షేమానికి మారుపేరు అని చెప్పారు. టీడీపీ ఆస్థి కార్యకర్తలేనని ఇక పార్టీలో ఎవరు కూడా అనాధలు కాదన్నారు. అధికారంలోకి వచ్చాక సాధికార సారథుల వ్యవస్థ తీసుకొస్తామన్నారు. జగన్ అడ్డదారిలో సీఎం అయ్యారని అధికారం అనే రాయితో ప్రజలను రాజకీయ పార్టీలను కొడుతున్నారని మండిపడ్డారు. ఇక జగన్ కు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదన్నారు. జగన్ ఎన్ని చేసిన ఇక ఇంటికి పోవడం ఖాయమని బాబు వెల్లడించారు.
మరోవైపు పెద్దాపురం పసుపుమయంగా మారిపోయింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో యువ నేత గున్నం చంద్రమౌళి పట్టణాన్ని పసుపుమయంగా మార్చేశారు. చంద్రబాబు బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం బహిరంగ సభ ఉండటంతో సుమారు 10వేల మందితో చంద్రమౌళి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. పెద్దాపురం టికెట్ ఆశిస్తున్న చంద్రమౌళి వైసీపీ బెదిరింపుకు భయపడబోనని ఎన్ని అడ్డంకులు ఎదురైనా టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com