ఎలాగైనా గెలవాలనే ఇలా చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

ఎలాగైనా గెలవాలనే ఇలా చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కడపలో పార్టీనేతలు, క్లస్టర్ల బాధ్యులతో సమావేశం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగస్ సర్కార్ అవలంబిస్తున్న తీరును ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కడపలో పార్టీనేతలు, క్లస్టర్ల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ సొంత నియోజకవర్గం నుండి బీటెక్ రవి ఎమ్మెల్సీగా విజయం సాధించారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఈ సారి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులివెందులకు చెందిన రాంగోపాల్‌ను నిలబెట్టామన్నారు. రాంగోపాల్ విజయం మార్పుకు నాంది పలుకుతుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఉద్యోగ సంఘాలతో సమావేశం పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story