ఒక సైకో వందమంది సైకోలను తయారు చేస్తాడు: చంద్రబాబు

ఒక సైకో వందమంది సైకోలను తయారు చేస్తాడు: చంద్రబాబు
నూతన ఎమ్మెల్సీలను అభినందించిన చంద్రబాబు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. వేపాడ చిరంజీవి, రాంగోపాల్‌ రెడ్డి, శ్రీకాంత్‌లకు మహిళా కార్యకర్తలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబును ముగ్గురు ఎమ్మెల్సీలు కలిశారు. వారికి బాబు అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడిన బాబు రాజకీయాల్లో విశ్వసనీయత బాగా పనిచేస్తుందని దానికి నిదర్శనం చిరంజీవిరావు అని తెలిపారు. రాంగోపాల్ రెడ్డి పులివెందులలో రౌడీయిజాన్ని ఎదిరించాడన్నారు. జగన్‌ పిరికివాడు, పులివెందులలో ఓడిపోయాడన్నారు.

అక్కడ అధికారులు నిమిత్తమాత్రులు, జగన్‌ క్రైమ్‌ చేయడానికి పార్ట్‌నర్స్‌ను తయారు చేసుకుంటాడు మెల్లగా ఒక్కో క్రైమ్‌ చేయించుకుంటూ వాళ్లను కాపాడుతూ బిగ్ క్రిమినల్స్‌గా తయారు చేస్తాడని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది కూడా కోడికత్తి, గొడ్డలిపోటు డ్రామా లాంటిదేనన్నారు. 75 ఏళ్లు ఉన్న బుచ్చయ్య చౌదరిపై దాడి చేశారు, ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడి అమానుషమన్నారు. ఒక సైకో వంద మంది సైకోలను తయారు చేస్తాడన్నారు. వైసీపీ ఎంతకైనా తెగిస్తుంది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మావాళ్లు పోరాడారని బాబు వెల్లడించారు. జీఓ నంబర్‌1 రద్దు చేసే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story