AP : సీఐడీ పోలీసులపై బెజవాడ బార్ అసోసియేషన్ ఫైర్

AP : సీఐడీ పోలీసులపై బెజవాడ బార్ అసోసియేషన్ ఫైర్

ఏపీ సీఐడీ పోలీసులపై బెజవాడ బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్గదర్శి కేసులో సీఐడీ పోలీసుల తీరుపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్ సమావేశంలో పాల్గొన్న లాయర్లు, జర్నలిస్టులకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐడీ పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని లాయర్లు మండిపడ్డారు. భావ స్వేచ్ఛ హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని.. సీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు బెదరేదే లేని స్పష్టం చేశారు. ఇక సీఐడీ తీరుపై న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story