Vision 2050 : చంద్రబాబును మనం గెలిపించుకోవాలి : NTR ఫ్యామిలీ

Vision 2050 : చంద్రబాబును మనం గెలిపించుకోవాలి : NTR ఫ్యామిలీ

నిమ్మకూరు పర్యటనలో ఉన్న నందమూరి అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్తబట్టలు అందజేశారు నందమూరి కుటుంబ సభ్యులు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, సుహాసిని చంద్రబాబుకు కొత్త బట్టలు పెట్టారు. అనంతరం నిమ్మకూరు గ్రామం తరుపున చంద్రబాబుకు రామకృష్ణ, స్థానిక సర్పంచ్‌, వార్డులు సభ్యులు పౌర సత్కారం చేశారు.

మా నాన్న నడయాడిన నేలపై నేడు పండగ వాతావరణం కన్పిస్తోందని ఈ సందర్భంగా రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సభ ఇక్కడ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రాంతాలు వేరైన తెలుగు వారంతా ఒక్కటేనని ఎన్టీఆర్ చాటి చెప్పారని గుర్తు చేశారు. తెలుగు వారంతా ఎక్కడ ఉన్న ఐక్యతతో ఉండాలన్నారు. ఎన్డీఆర్‌ కుమారుడిగా తాను జన్మించడం వల్లే తనకు ఈ గుర్తింపు వచ్చిందన్నారు. ఏదేశమేగినా తెలుగువారి గొప్పతనం చాటిచెప్పాలన్నారు.


రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మహోన్నత స్థాయికి ఎదిగారని సుహాసిని అన్నారు. చిన్న ఉద్యోగం నుంచి సీనీహీరోగా రికార్డులు సృష్టించారని గుర్తు చేశారు. తన పట్ల ఇంత ఆదరణ చూపిన ప్రజల కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్న సుహాసిని.. అందరికీ కూడు, గూడు అందించాలనే తెలుగు దేశం పార్టీ పెట్టారని చెప్పారు. తెలుగు జాతి గొప్పతనం గురించి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. సూర్య, చంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ కీర్తి ఉంటుందన్నారు. ఇక ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారన్నారు. చంద్రబాబు విజన్ 2020 ఎలా ఉంటుందో చూపించారని.. ఇప్పుడు విజన్ 2050 అన్న చంద్రబాబును మనం గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story