AP : ఆసుపత్రిలో సైనికుడిపై దాడి

AP : ఆసుపత్రిలో సైనికుడిపై దాడి
X

తీవ్ర గాయాలతో దేశ రక్షకుడు ఆస్పత్రిలో ఉంటే.. దాడి చేసినవాడు మాత్రం బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఓ జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ఒక సైనికుడికి ఇచ్చే గౌరవం అంటూ బాధిత జవాన్‌ ప్రశ్నిస్తున్నాడు. దేశ సరిహద్దుల్లో పని చేస్తున్న సమరసింహారెడ్డి అనే జవాన్.. చాలా రోజుల తర్వాత జాతర కోసం తన స్వగ్రామం ధర్మవరం మండలం తుమ్మలకు వచ్చారు. జాతరలో ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో ఊరు అవతలే వాహనాలు పార్కింగ్‌ చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఐతే.. జాతరకు వచ్చిన వైసీపీ నేత.. జడ్పీ వైస్‌ ఛైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌ రెడ్డి తన వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టారని.. ఆ వాహనాన్ని అడ్డుతీయమని చెప్పినందుకు గొడవకు దిగారని జవాను సమరసింహారెడ్డి చెప్పారు. జాతర అయిపోయిన తర్వాత ధర్మవరం బయల్దేరగా.. మార్గమధ్యలో సుధాకర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి తీవ్రంగా దాడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాను చనిపోయానని భావించి.. వారు వెళ్లిపోయారన్నారు. పోలీసులకు తన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని.. కానీ పోలీసులు మాత్రం నామమాత్రపు కేసులు నమోదు చేసి.. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారని సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో తప్పును ప్రశ్నిస్తే.. దేశ సైనికుడికి ఇలాంటి గౌరవం దక్కుతుందా అని ప్రశ్నించారు. తనపై స్వయంగా దాడి చేసిన వైసీపీ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story