ముక్తేశ్వరం సెంటర్‌లో టీడీపీ ధర్నా

ముక్తేశ్వరం సెంటర్‌లో టీడీపీ ధర్నా

కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్‌లో టీడీపీ ధర్నా చేపట్టింది. టీడీపీ నాయకులు గంటి హరీష్‌ మాధుర్, నామన రాంబాబు, మోకా ఆనంద్‌ సాగర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్.. నారా లోకేష్‌ దిష్టిబొమ్మను తగులబెట్టడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. లోకేష్ మాటలను వైసీపీ నేతలు వక్రీకరించారని హరీష్‌ మాధుర్ ఫైర్ అయ్యారు. తాను ముక్తేశ్వర సెంటర్‌లోనే ఉంటానని తేల్చిచెప్పారు. నిరూపించడానికి తాను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైసీపీ నేతలకు హరీష్‌ మాధుర్ సవాల్ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story