సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యుల లేఖ కలకలం

సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యుల లేఖ కలకలం
X

విశాఖ సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యుల లేఖ కలకలం రేపుతోంది. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి దేవాదాయశాఖ మంత్రితో పాటు.. వీఐపీలు కూడా గర్భగుడిలోకి వెళ్లకూడదని ట్రస్ట్ సభ్యుల తీర్మానం చేశారు. సీఎం కార్యాలయానికి 12 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు లేఖ పంపారు. ధర్మకర్త, పీఠాధిపతులు తప్ప ఇంకెవరు కూడా.. గర్భగుడిలోకి వెళ్లేందుకు వీలు లేదని కోరారు. ఈనెల 23న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. బోర్డు సభ్యులు తీర్మానం చేసి లేఖ రాయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

Tags

Next Story