AP : కుప్పంలో వైసీపీ అత్యుత్సాహం..!

AP : కుప్పంలో వైసీపీ అత్యుత్సాహం..!

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ అత్యుత్సాహం చూపుతోంది. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న అన్న క్యాంటీన్‌కు పోటీగా రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఏకంగా బస్‌ షెల్టర్‌కు వైసీపీ రంగులు వేశారు. అయితే ఇదంతా రాజకీయ లబ్ది కోసమే అంటున్నారు స్థానికులు. గత నాలుగేళ్లగా అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన వైసీపీ సర్కార్‌ ఇప్పుడు పేదలపై కపట ప్రేమ చూపుతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికే కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో టీడీపీ ఆఫీస్‌ పక్కన ఉన్న స్థలంలో మరింత విస్తృతంగా అన్న క్యాంటీన్‌ నిర్వహించాలనే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో రాజన్న క్యాంటీన్‌ అంటూ హడావుడి చేస్తున్నారిని స్థానికులు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story