మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది: జీవీరెడ్డి

X
By - Subba Reddy |27 April 2023 3:45 PM IST
మార్గదర్శి లో ఏదో జరిగిందంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ హడావుడి చేస్తున్నారు
మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష్య సాధిస్తోందని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డి. మార్గదర్శి లో ఏదో జరిగిందంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ హడావుడి చేస్తున్నారని, ఈ అంశంపై మే 14న ఆయనతో చర్చించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.జగన్, సజ్జల ఆధ్వర్యంలో అయినా చర్చకు సిద్ధమన్నారు. చర్చకు బలాబలాలతో సంబంధం లేదని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా సరెండర్ అవ్వాలనేలా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఆరోపించారు జీవీ రెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com