AP : జగన్ సర్కార్ పై ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

X
By - Vijayanand |28 April 2023 2:14 PM IST
జగన్ సర్కార్, వైసీపీ నేతలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. చేకూరు, వీరనాయునిపాలెం గ్రామాల్లో కోట్ల రూపాయల ప్రజా సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 ఎకరాల్లో గ్రావెల్ తవ్వేశారని ఆరోపించారు. గ్రావెల్ మాఫియా అక్రమంగా తవ్వేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రావెల్ వెనుక సీఎం కార్యాలయం సిబ్బంది ప్రోత్సాహం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ధూళిపాళ్ల.. స్థానిక ఎమ్మెల్యే 2 వేల 500 కోట్ల గ్రావెల్ మాఫియాపై కోర్టుకు వెళ్తామని స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com