లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నానా హంగామ
కర్నూలు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర వైసీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. లోకేష్ ఎప్పుడేం విమర్శలు చేస్తారో.. అవినీతి చిట్టా ఎలా బయటపెడతారోనని హడలిపోతున్నారు. అందుకే ఆయన పాదయాత్రను అడ్డుకునేందుకు అక్కడక్కడా విఫలప్రయత్నం చేస్తున్నారు. తాజాగా.. కోడుమూరు బస్టాండ్ సర్కిల్లో ఇదే ప్రయత్నం జరిగింది. నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు.. వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ నానా హంగామా చేశారు. తన అనుచరులు, అనుకూల దళిత సంఘాల నేతలతో కలిసి ఎమ్మెల్యే బస్టాండ్ సర్కిల్ దగ్గర బైఠాయించారు. ఎమ్మెల్యే బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యేను.. ఆయన వర్గీయులను అరెస్ట్ చేశారు.
ఇటు.. ఎమ్మెల్యే సుధాకర్ తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోడుమూరులో ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్కు వ్యతిరేకంగా.. ఎమ్మెల్యే సోదరుడు, టీడీపీ నేత జరదొడ్డి సుదర్శన్ ఆందోళనకు దిగారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com