అన్నదాతల ఆక్రందన ఉప్పెన అవుతుంది

జగన్ సర్కార్ పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో రైతుల బాధలు పట్టవా..? అంటూ ట్వీట్ చేశారు. నేటి అన్నదాతల ఆక్రందన.. రేపు ఉప్పెన అవుతుందని..ఆ ఉప్పెనలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోరన్న చంద్రబాబు..దెబ్బతిన్న పంట వివరాలు ఎందుకు వెల్లడించ లేదని ప్రశ్నించారు.
బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణమేంటని,అన్నదాతకు నష్టపరిహారం ఎందుకు ప్రకటించ లేదన్నారు.దెబ్బతిన పంట ఎంత..? కొన్న ధాన్యం ఎంత..? అని సర్కార్ను నిలదీవారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రైతులను ఆదుకోవ డానికి రాకెట్ సైన్స్ చదవాలా..? అన్నాడని ఇప్పుడు ముడుచుకు కూర్చు న్నాడని సెటైర్ వేశారు.15 జిల్లాల్లో పంటనష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరకు జగన్ వెళ్లలేదని ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com