శ్రీశైలంలో లోకేష్ యువగళం

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది. ఎక్కడికక్కడ నారా లోకేష్కు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. లోకేష్తోపాటు అన్నీవర్గాల ప్రజలు కలిసి నడుస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్ దారి పొడువునా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. హామీలు ఇస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. మహిళలు లోకేష్కు మంగళహారతులు పడుతున్నారు. టీడీపీ శ్రేణులు జై లోకేష్.. జై టీడీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
మరోవైపు లోకేష్ పాదయాత్ర నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు బండి ఆత్మకూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. 4.30కి పర్నపల్లెలో లోకేష్ సమక్షంలో భారీ సంఖ్యలో చేరికలు జరుగనున్నాయి. 6.05కి ఎ.కోడూరు స్థానికులతో నారా లోకేష్ మాటమంతీ నిర్వహించనున్నా రు. అనంతరం నంద్యాల నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. తర్వాత 6.30కి కొత్తపల్లి స్థానికులతో ముచ్చటించనున్నారు. రాత్రి 7.05కి కొత్తపల్లి ప్రజలతో సమావేశం కానున్నా రు. 8.45కి కొత్తపల్లిలో అసంపూర్తిగా నిర్మాణం జరిగిన కాపుభవన్ను సందర్శిస్తారు. రాత్రి 9 గంటలకు మూలమట్టం విడిది కేంద్రం వరకు పాదయాత్ర సాగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com