Ruia Hospital : తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి

X
By - TV5 Digital Team |11 May 2021 10:04 AM IST
తిరుపతి రుయా ఆసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారు. రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ లో మార్పులు రావడంతో రోగులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్ రాగానే పరిస్థితిని పునరుద్దించామని అన్నారు. ఆసుపత్రిలో సుమారు వెయ్యి మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 135 మంది ఐసీయూ వార్డులో ఉండగా.. మరో 465 మంది ఆక్సిజన్ పడకలపై ఉన్నారు. ఇందులో మొత్తం 163 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com