AP : 14న ఏపీకి ఆర్థిక సంఘం రాక

X
By - Manikanta |4 April 2025 4:00 PM IST
14న ఏపీకి ఆర్థిక సంఘం రాకఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక సంఘం పర్యటన ఖరారైంది. 16వ ఆర్ధిక సంఘం ఈనెల 14న రాష్ట్రానికి రానుంది. ఆర్థిక సంఘం అధికారులు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆర్థిక సంఘంతో ఈనెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశం కాను న్నారు. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం చేయాలని కోరనున్నారు. ఈ భేటీకి సంబంధించి సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 16 ఆర్థిక సంఘం ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com