Andhra Pradesh corona cases : ఒక్కరోజులోనే కరోనాతో 108 మంది మృతి..!

Andhra Pradesh corona cases : ఒక్కరోజులోనే కరోనాతో 108 మంది మృతి..!
తాజాగా గడచిన 24 గంటల్లో 86,878 కరోనా పరీక్షలు చేయగా 20,345 కరోనా కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా చిత్తూరు (2,426), కర్నూలు(707) జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా కరుణ వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 86,878 కరోనా పరీక్షలు చేయగా 20,345 కరోనా కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా చిత్తూరు (2,426), కర్నూలు(707) జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 13,22,934 కి చేరింది. అటు గడచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 108 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 8,899 కి చేరింది. ఇక ఒక్క రోజు వ్యవధిలో 14,502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,95,102 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది

Tags

Read MoreRead Less
Next Story