AP Corona Cases : ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!

AP Corona Cases : ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!
AP Corona : ఏపీలో నిన్నటి కంటే కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. గత 24గంటల్లో కొత్తగా 2వేల 174 కేసులు వచ్చాయి.

AP Corona : ఏపీలో నిన్నటి కంటే కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. గత 24గంటల్లో కొత్తగా 2వేల 174 కేసులు వచ్చాయి. 74వేల 820 సాంపిల్స్ పరీక్షించగా.. రెండు వేలకుపైగా కేసులు పాజిటివ్ వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కోవిడ్ తో 18 మంది మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరుచొప్పున... నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖలో ఒక్కొక్కరుచొప్పున మృత్యువాతపడ్డారు. అదే విధంగా ఒక్కరోజులో 2వేల 737 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తూర్పుగోదావరిజిల్లాలో అత్యధికంగా 418 కేసులు నమోదుకాగా..చిత్తూరులో 329, కృష్ణాలో 248, నెల్లూరులో246పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యంత తక్కువగా కర్నూలు జిల్లాలో కేవలం 8 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story