అనంతపురంలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

అనంతపురంలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాయదుర్గం మండలం కదరంపల్లి సమీపంలో ద్విచక్రవాహనంలో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే ముగ్గురూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుని ఢీ కొన్న వాహనం గురించి కనుక్కునేందుకు పోలీసులు స్థానికంగా పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story