ఏపీలో కొత్తగా 3,263 కేసులు, 11 మంది మృతి

ఏపీలో కొత్తగా 3,263 కేసులు, 11 మంది మృతి
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కొత్తగా 3వేల 263 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కొత్తగా 3వేల 263 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనాతో 11 మంది మరణించారు. చిత్తూర్‌ జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప, కర్నూల్‌, విశాఖలో ఒక్కక్కరు చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 654 కేసులు నమోదయ్యాయి.

విశాఖలో 454, గుంటూరులో 418, కృష్ణా జిల్లాలో 318, శ్రీకాకుళంలో 280, కడపలో 259 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నెల్లూరులో 245, కర్నూల్‌లో 176, ప్రకాశంలో 176, విజయనగరంలో 83 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనా నుంచి 1091 మంది పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం ఏపీలో 23 వేల 115 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 7 వేల 311 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 లక్షల 28వేల 664కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story