ఏపీలో కొత్తగా 3,495 కోవిడ్ కేసులు.. 9మంది మృతి..!

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్తగా 3వేల 495 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్తో ఒక్క రోజులో 9మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 9లక్షల 25వేల 401 లకు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 7వేల 3వందలకు చేరాయి. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో వైరస్ విజృంభిస్తుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.
గడిచిన 24గంటల్లో చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు,ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇక కేసులు విషయానికి వస్తే.. గుంటూరులో 501, విశాఖలో 405, కృష్ణాలో 306 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 20వేల 954 యాక్టివ్ కేసులుఉన్నాయి. ఇప్పటి వరకు 8లక్షల 97వేల 147 మంది వైరస్ నుంచి కోలుకున్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com