Bapatla: బాపట్లలో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతు..
By - Divya Reddy |16 Jun 2022 2:00 PM GMT
Bapatla: బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.
Bapatla: బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. హార్బర్ నుంచి బోటులో సముద్రం ఒడ్డుకు వెళ్లే క్రమంలో అలల తాకిడికి బోటులో ఉన్న నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో ఒక పాప డెడ్ బాడీ లభ్యం కాగా.. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు.. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com