ఏపీలో కోత్తగా 758 పాజిటివ్ కేసులు.. !
By - TV5 Digital Team |25 March 2021 12:30 PM GMT
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 35 వేల 196 శాంపిల్స్ పరిశీలించగా.. 758 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 35 వేల 196 శాంపిల్స్ పరిశీలించగా.. 758 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా చిత్తూరులో 175 కేసులు నమోదవగా.. గుంటూరులో 127, విశాఖపట్టణంలో 98, కృష్ణా జిల్లాలో 80 కేసులు నమోదయ్యాయి. వైరస్తో నలుగురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 7 వేల 201 మంది మృతి చెందారు. 231 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 3 వేల 469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 8 లక్షల 92 వేల 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com